Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మూడు ప‌దుల వ‌య‌సు దాటిపోతున్నా స‌రే... అమ్మాయిల్లో త‌నకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిర‌స్క‌రిస్తుంటాడు. స్కూల్‌లో త‌న‌కు సీనియ‌ర్ అయిన వైష్ణ‌వి (శ్రీదేవి విజ‌య్‌కుమార్‌)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్‌ తనకు కాబోయే భార్య‌లో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక‌. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఎంత చెప్పినా అందులో రాజీప‌డ‌డు. తీరా ఉద్యోగరీత్యా విదేశాల‌కు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదుర‌వుతుంది (Sundarakanda Review). తొలి ప‌రిచ‌యంలోనే ఆమెలో త‌న‌కు న‌చ్చే కొన్ని లక్షణాలను గ‌మ‌నిస్తాడు. దాంతో త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకొని మ‌రీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు త‌న కుటుంబంతో క‌లిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్క‌డ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్న‌ప్పుడు స్కూల్‌లో తాను ఎంత‌గానో ఆరాధించిన వైష్ణ‌వికి సిద్ధార్థ్ ఎందుకు దూర‌మ‌య్యాడు? మ‌ళ్లీ ఆమె త‌న జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జ‌రిగింది? అస‌లు సిద్ధార్థ్‌, ఐరా పెళ్లి జ‌రిగిందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?  
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.

ఓటీటీ స్ట్రీమింగ్‌ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
IMDb రేటింగ్: 8.3/10
సోమన్ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నమ్మే వ్యవసాయ అధికారి. అయితే, అతని జీవన విధానం అతనిని తన గ్రామంతో, అతని భార్యతో కూడా విభేదిస్తుంది.
దియా, ఒక యువ అంతర్ముఖ అమ్మాయి కథను చెబుతుంది.ఆమె తన కాలేజీ సహచరులలో ఒకరైన రోహిత్‌ను ప్రేమిస్తున్నప్పుడు ఆమె రోజువారీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. అంతర్ముఖ అమ్మాయిగా ఉండటం మరియు తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించడం ఆమె జీవితంలో అతిపెద్ద సవాలుగా మారుతుంది.
Featured
కథ: జై (ప్రభాస్) ఇటలీలో మానస (రిచా గంగోపాధ్యాయ) తో ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబ సభ్యులు పల్నాడు ప్రాంతానికి చెందిన క్రూరమైన ఫ్యాక్షనిస్టులు అనే పేరున్న నేపథ్యం కలిగి ఉన్నారని ఆమె అతనికి చెబుతుంది. జైకి శాంతి తత్వం మరియు ప్రేమ జీవనశైలి ఉంది. యుద్ధం ద్వారా కాదు, ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చని అతను భావిస్తాడు. అతను వేరే సాకుతో మానస గ్రామానికి వెళ్లి ఫ్యాక్షనిస్టుల వైఖరిని మారుస్తాడు. మిగిలిన కథ అంతా జై నేపథ్యం మరియు అతను శాంతిని ప్రచారం చేసే వ్యక్తిగా ఎలా మారాడు అనే దాని గురించి.
IMDb రేటింగ్: 7.3/10
బాబు (నాని) ఒక అదృష్టవంతుడు, అతను కీర్తి (కీర్తి సురేష్) తో ప్రేమలో పడతాడు. అతను ఆమెను ఆకర్షించడం ప్రారంభించాడు మరియు చాలా ప్రయత్నించిన తర్వాత చివరికి ఆమెను ఆకట్టుకోగలిగాడు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, కీర్తి తండ్రి (సచిన్ ఖడేకర్) మరియు ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ వర్మ (నవీన్ చంద్ర) రూపంలో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ పోలీసు ఎవరు? కీర్తి తండ్రి ఏమి చేస్తున్నాడు? మరియు బాబు తన సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకుంటాడు మరియు చివరికి కీర్తిని ఎలా వివాహం చేసుకుంటాడు? అదే మిగిలిన కథ.
ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.
విడుదల తేదీ: 02 జూన్,2016
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‍గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
IMDb రేటింగ్ : 6.8/10
ఈ చిత్రం 1989 లో జితేంద్ర (జగపతి బాబు), అతని తండ్రి, కర్నూలులో నిర్దాక్షిణ్యమైన డాన్ స్థానిక MLA కుమార్తె అయిన కల్యాణిని పెళ్ళిచుపులు కోసం వైజాగ్ వస్తాడు.తిరిగి వెళ్ళెడప్పుడు, జితేంద్ర కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కారు నుంచి బయటకు రావాలని అడిగిన ఒక వ్యక్తిని కల్చేస్తాడు.దానితో చుట్టు ఉన్న వ్యక్తులు అతనని ఆ ప్రాంతపు పెద్ద మనిషి (సుమన్) దగ్గరకు తీసుకు వెల్తారు.అతని కుటుంబంలో, అతని తల్లి; భార్య (సుహాసిని) ఒక కళాశాల లెక్చరర్; సోదరి (ఈశ్వరి రావు); బావ (రావు రమేశ్); వారి పిల్లలు; యువకుడైన కుమారుడు జైదేవ్, కుమార్తె;, అతని విశ్వసనీయ భాగస్వామి రఘవియా (చలపతి రావు).ఆ పెద్ద మనిషి గాయపడినవారికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించమని జితేంద్రను అడుగుతాడు. ఇది జితేంద్ర అహాన్ని దెబ్బతీస్తుంది, ప్రజలను పేదలుగా పిలిచి వారిని అవమానిస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అతన్ని కొట్టి అతన్ని అరెస్టు చేస్తాడు, అందుచే జితేంద్ర పగ పడతాడు.

జితేంద్ర తండ్రి (రామరాజు) భూస్వామి భార్య, జైదేవ్ను కిడ్నాప్ చేసి, ఫిర్యాదును తిరిగి తీసుకోవాలని అతన్ని బలవంతం చేస్తాడు.జితేంద్ర విడుదలయ్యారు, వారు బంధించి ఉన్న ప్రదేశానికి వెళతారు.అతను తన తండ్రి చనిపొయి ఉండతం చూస్తాడు, వారిలో చాలామంది హంతకులు చంపబడ్డారు. జమీదేవ్ తల్లిని చంపినందువల్ల రామరాజు హత్య చేసినట్లు వెల్లడించారు. అందువలన వారి శత్రుత్వం శాశ్వతమైనది.తిరిగి జయదేవ్ ఇంటిలో, జైదేవ్ నానమ్మ (సుజాత కుమార్) తన ముత్తాత, తాత, మామయ్య లాగ హత్యకు గురవుతాడని భయపడుతుంది, అందువల్ల అమె వారి కుటుంబ సభ్యులందరిని విదేశాలు పంపుతుంది.జితేంద్ర విశాఖపట్నమ్లో పలుకుబడిగల వ్యక్తిగా మారతాడు.

కృష్ణ (నందమూరి బాలకృష్ణ) దుబాయ్లో ఉంటాదు, ఇక్కడ అతను వ్యబిచారమ్లో విక్రయించబడే కొంతమంది భారతీయ బాలికలను రక్షిస్తాడు, అతని ప్రియరాలు స్నేహ (సోనాల్ చౌహాన్), గురు మాణిక్యం (బ్రహ్మానందం)తో కలిసి వైజాగ్ లో తిరిగి రావాలని ప్రణాళిక చేస్తున్నాడు భారతదేశంలో వారి వివాహం గురించి పెద్దలకు చెప్పటానికి.అప్పుడు అతను స్నేహ తండ్రి జితేంద్ర యొక్క వ్యాపార భాగస్వామి (ఆహుతి ప్రసాద్) తో కలస్తాడు.అతను విమానాశ్రయం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను జితేంద్ర పెద్ద కుమారుడు చోటు (శారవణన్), అతని అనుచరులను అతనిని చంపాలని కోరుకునే మాజీ ఎమ్మెల్యేని రక్షిస్తాడు.కృష్ణ వాటిని తీవ్రంగా కొడతాడు, ఇది జైదీవ్ యొక్క మాజీ సహచరుల అది గుర్తిస్తారు. ఇంతలో, చోటు, మాజీ MLA ఇద్దరూ అదే ఆసుపత్రిలో చెరతారు. చొటు ఆ ఎం.ఎల్.ఎ.ని చంపటానికి వెల్తాడు కాని రహస్యకర పరిస్థితులలో అతను చనిపొతాడు.జయదెవ్ పొలిసులతో కలసి హాస్పటల్ సి.సి. ఫుతేజ్లో కృష్ణని చుసి అతనని చంపాలని చుస్తాడు.ఆలయం వద్ద అతను కృష్ణని కాల్చి తన రెండవ కుమారుడు, అతని సహచరులను స్నేహతో సహా మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఆదేశిస్తాడు, కాని సరైన సమయంలో జైదేవ్ (నందమూరి బాలకృష్ణ), కృష్ణుడి అన్నయ్య) వారిని రక్షిస్తాడు.

జైదేవ్ జితేంద్ర రెండవ కుమారుడు,అతని అనుచరులు, ఎసిపిని హత్య చేస్తాడు, జితేంద్ర నియంత్రణలో లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత MLA (జయప్రకాష్ రెడ్డి) ను బెదిరిస్తాడు. జితేంద్ర కుమారులు అంత్యక్రియల అప్పుడు, జితేదేవ్ యొక్క చిన్న కుమారుడికి జైదేవ్ కథను ఎమ్మెల్యే చెప్పి, అతను ప్రమాదకరమైన గతంతో ఉన్నాడని చెబుతాడు.ఈ కథ 1999 కి మారిపోతుంది, అక్కడ జితేంద్ర తన సోదరుడు అజయ్ (అజయ్) ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నాడు, అతని నేర స్వభావం కారణంగా పార్టీ టికెట్ ఇవ్వని స్థానిక MP ని హత్య చేశాడు.జైదెవ్ వారిని కొట్టి జితేంద్రను అరెస్టు చెయిస్తాడు. జైదెవ్ కుటుంబం అతనికి దూరంగ ఉంతుంది.తన మరదలు రాధిక (రాధిక ఆప్టే) అతన్ని ప్రేమించి పెళ్ళి చెసుకుంటుంది.అజయ్ జైలు నుండి బయటికి వచ్చి కృష్ణని ఎత్తుకెల్తాడు.జైదేవ్ అతన్ని చంపి జితేంద్రని వైజగ్ వదిలి వెల్లిపొమ్మంటాడు.కర్నూలు రైల్వే స్టేషన్లో తన మనుషుల ప్రేరణతో వైజగ్ వచ్చి రాధికను రైల్వయ్ యార్డుకు ఎత్తుకెల్తాడు.అక్కడికి జైదెవ్ వచ్చి జితేంద్ర మనుషులను చంపుతాడు.జితేంద్ర రాధికను కత్తితో పొడుస్తాడు.జైదెవ్ జితేంద్రని తెవ్రంగా గాయపరుస్తాడు.రాధిక జైదెవ్ చెతుల్లో చనిపొతుంది.దానితో జైదెవ్ నానమ్మ తన వారి కుటుంబన్ని కలవకూడదని లెకపొతే తను చనిపొతానని హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం జయదేవ్ నుండి రక్షించటానికి జితేంద్ర యొక్క మూడవ కుమారుడు అమెరికాకు వెళ్లడానికి ఎమ్మెల్యే సలహా ఇస్తాడు.జైదెవ్ తన కుటుంబ సభ్యులతో కలుస్తాడు.జితేంద్ర రాష్త్రానికి ముఖ్యమంత్రి అవ్వటానికి ఎం.ఎల్.ఎ.లకు లంచం ఇవ్వటానికి సిద్దపదతాడు.కాని జైదెవ్ వారిని హెచ్చరించి ప్రజల కోసం పని చెయ్యలని చెబుతాడు.జితేంద్ర వారిని చంపటానికి వస్తాడు కాని జైదెవ్ జితేంద్రని చంపటంతో కథ ముగుస్తుంది.


బాలకృష్ణ నందమూరి, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, కమల్ కామరాజు, రావు రమేష్, సమీర్, పృధ్వీరాజ్, హంస నందిని, చలపతి రావు, సుమన్, సుజాత కుమార్, సుహాసిని తారాగణం, సెయింట్, దేవిస్ & ఇతర సంగీతం స్క్రీన్ ప్లే & దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట & అనిల్ సుంకర, సమర్పణ: సాయి కొర్రపాటి.
అప్పదాసు (SPB) ఒక రిటైర్డ్ టీచర్ మరియు అతను తన భార్య బుచ్చి (లక్ష్మి)తో కలిసి తన స్వగ్రామంలో నివసిస్తున్నాడు. ఇద్దరూ సీనియర్ సిటిజన్లు మరియు వారి పిల్లలందరూ విదేశాలలో నివసిస్తున్నారు. కానీ వారి జీవితం గురించి ఒంటరిగా మరియు అభద్రతా భావానికి బదులుగా, అప్పదాసు మరియు బుచ్చి ఇద్దరూ తమదైన ప్రేమను కలిగి ఉంటారు మరియు వారు ప్రతి రోజును ఒక ప్రత్యేక రోజుగా భావిస్తారు మరియు క్షణాలను ఆస్వాదిస్తారు. ఈ సంబంధంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మరియు జీవితం వారి కోసం ఏమి నిల్వ చేస్తుందో మిగిలిన కథను రూపొందిస్తుంది. IMDb రేటింగ్ : 8.1/10
మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.
ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది.
IMDb రేటింగ్: 7/10
Rotten Tamatoes : 64%
సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
శ్రీరామ్ (వెంకటేష్) మరియు సీత (సౌందర్య) లకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. తన భార్య పిల్లలను కనలేదని డాక్టర్ ద్వారా శ్రీరామ్ తెలుసుకుంటాడు, అతను తన భార్య మనోభావాలను దెబ్బతీయడానికి ఇష్టపడడు, తనపైనే నిందలు వేస్తాడు. శ్రీరామ్ తండ్రి (కోట శ్రీనివాసరావు) పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి, శ్రీరామ్‌ను రెండవ వివాహం చేసుకోవాలని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేపాల్ వ్యాపార పర్యటనలో ఉన్నప్పుడు, అతను నేపాలీ అమ్మాయి మనీషా (వినీత)ను కొన్ని అనివార్య పరిస్థితులలో వివాహం చేసుకుంటాడు. ఆమె తన బిడ్డను మోస్తున్నట్లు తెలుసుకున్న శ్రీరామ్, ఆమె స్నేహితుడు గిరి (బ్రహ్మానందం) ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు. మనీషా ఒక అబ్బాయిని ప్రసవిస్తుంది మరియు శ్రీరామ్ తన భార్య అనుమతితో అతన్ని దత్తత తీసుకుంటాడు, అతనికి నిజం తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ్ తండ్రి గిరి ద్వారా నిజం తెలుసుకుంటాడు, శ్రీరామ్ మనీషాను తిరిగి తీసుకురావాలని మరియు సీతకు విషయాలు చెప్పాలని కోరుకుంటాడు. కానీ సీత స్పందనకు భయపడిన శ్రీరామ్ తన తండ్రిని ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచమని వేడుకుంటాడు మరియు అతను మనీషాను తన ఇంటికి వంటమనిషిగా తీసుకువస్తాడు. సీత వంటగదిలో జరుగుతున్న పనులతో సంతోషంగా లేదు, ఆమె మనీషాను వేరొకరితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు శ్రీరామ్ రహస్యాన్ని వెల్లడిస్తుంది, సీత కూడా పరిస్థితులను మరియు పరిస్థితులను అర్థం చేసుకుంటుంది మరియు ఆమె సంతోషంగా మనీషాను వారి జీవితాల్లోకి స్వాగతిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడాలనుకుంటే లింక్
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.
రవితేజ ఒక పారిశ్రామికవేత్త, అతనికి వస్త్ర కంపెనీ ఉంది. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి, కానీ అతని వ్యక్తిగత జీవితంలో సామరస్యం మరియు శాంతి లేదు. అతని భార్య మరియు ఆమె తల్లి హింసించడంతో, అతను జీవితాన్ని దుర్భరంగా భావిస్తాడు. అతను నెమ్మదిగా తన అందమైన పర్సనల్ అసిస్టెంట్ ప్రియంవదను ప్రేమిస్తాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాన్ని తట్టుకోలేరు మరియు అతను మరొక వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ, అతను చిన్న దొంగ అయిన నాగరాజును కలుస్తాడు. నాగరాజు రవితేజను కాపాడతాడు మరియు అతను వారి స్థానాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తాడు, తద్వారా అతని సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి. నాగరాజు దీనికి అంగీకరిస్తాడు మరియు మాధవికి, ఆమె తల్లికి మరియు రవితేజ శత్రువులకు ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ దొంగ జీవనశైలిని నడిపించే వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను సీతను ఎదుర్కొంటాడు, ఆమె కూడా చిన్న దొంగ. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు మరియు కథను సంతోషంగా ముగించారు.
మౌన రాగం సినిమా దివ్య (రేవతి) అనే కాలేజీ విద్యార్థిని కథను అనుసరిస్తుంది, ఆమె స్వేచ్ఛాయుత వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ ఆమె మాజీ ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) మరణంతో ఇప్పటికీ దుఃఖంలో ఉంది. ఆమె కుటుంబం చంద్రకుమార్ (మోహన్) తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుంది. తన కొత్త వివాహంతో రాజీ పడటానికి మరియు తన గతాన్ని వదులుకోలేక పోతున్న దివ్య అంతర్గత సంఘర్షణను ఈ సినిమా అన్వేషిస్తుంది. IMDb రేటింగ్ : 8.4/10
Featured
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది. క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.

Showing 1–24 of 27 results