Featured

అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్‌ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్‌’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :

మిరాయ్ సినిమా రివ్యూల సమాహారం లింకులు
Featured
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
త‌మిళ‌నాడులో తుపాకీ సంస్కృతిని అల‌వాటు చేసి సొమ్ము చేసుకోవాల‌నేది ఒక సిండికేట్ ప‌న్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్ద‌రు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్ర‌క్కుల‌కొద్దీ ఆయుధాల్ని త‌ర‌లిస్తుంది.అవ‌న్నీ ఓ ఫ్యాక్ట‌రీకి చేరుతుండ‌గా ఎన్‌.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేన‌న్‌) నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఏ ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్ట‌రీ మొత్తాన్ని పేల్చివేయాల‌నే ఒక ఆప‌రేష‌న్‌కి న‌డుం బిగిస్తుంది ఎన్‌.ఐ.ఎ. అయితే ఈ ఆప‌రేష‌న్ అంత సుల‌భమైన‌దేమీ కాదు. ఒక‌రి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ర‌ఘురామ్ (శివ‌కార్తికేయ‌న్‌)ను ప్రేమ్‌నాథ్ క‌లుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ఘురామ్‌ని ఈ ఆప‌రేష‌న్‌లోకి తీసుకు రావాల‌ని  నిర్ణ‌యిస్తాడు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిందా? అస‌లు ర‌ఘురామ్ ఎవ‌రు?అత‌నికి ప్రాణాలంటే లెక్క‌లేని త‌నం ఎందుకు? మాల‌తి (రుక్మిణీ వ‌సంత్‌)తో అత‌నికి ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.
తాజా యాక్షన్ సినిమా | తన సోదరులను కాపాడటానికి అన్నీ పణంగా పెడతాడు!
కథేంటంటే.. కింగ్‌పిన్‌ లాజిస్టిక్స్‌ అధినేత సైమన్‌ (నాగార్జున) శక్తిమంతమైన డాన్‌. ప్రభుత్వం నుంచి వైజాగ్‌ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్‌ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్‌.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్‌)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్‌) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్‌ మాటున సైమన్‌ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్‌ ఖాన్‌)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్‌ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్‌ (రచిత రామ్‌), అర్జున్‌ సైమన్‌ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్ బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి... పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్ అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.
మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికొనింగ్ కథ || మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి గల ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌) దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్‌ సబ్‌మెరైన్‌లో ఎంటిటీ ఒరిజినల్‌ సోర్స్‌ కోడ్‌ ఉంటుంది. దానిని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్‌ (ఏంజెలా బాసెట్‌) ఈథన్‌కు వాయిస్‌ నోట్‌ పంపుతారు. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీని అయినా నియంత్రించే శక్తిగల ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్‌ హంట్‌ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.
IMDb రేటింగ్: 7.3/10
రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్‌) ఎవ‌రూ లేని ఓ అనాథ. త‌న‌లాంటి తోటి పిల్ల‌ల‌తో క‌లిసి ఓ అనాథ శ‌ర‌ణాల‌యంలో ఆశ్ర‌యం పొందుతుంటాడు. ఆక‌లి, అవ‌స‌రాల కోసం నేరాల బాట పట్టిన రామ్‌.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శ‌ర‌ణాల‌యాల‌కి అండ‌గా నిలుస్తుంటాడు. పెరిగి పెద్ద‌య్యాక కూడా అదే బాట‌లోనే అతడి ప్ర‌యాణం కొన‌సాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్ట‌ర్ వ‌ర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కిన‌ట్లే చిక్కి త్రుటిలో త‌ప్పించుకున్న రామ్, కొన్నాళ్లు నేరాల‌బాట వీడి ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) న‌డుపుతున్న ఇండియాస్ నంబ‌ర్‌వ‌న్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల‌) ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల కోసం రంగంలోకి దిగుతాడు. అస‌లు ఎవ‌రీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంత‌ర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్ర‌గ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి రామ్ ర‌క్ష‌ణ క‌ల్పించాడా లేదా?అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 4.5/10
ముగ్గురు న్యూరో సర్జన్ల మిస్టరీ కేసు హత్య దర్యాప్తు కోసం సిబిఐ అధికారిణి ప్రియా కృష్ణ (ప్రియమణి) నగరానికి వస్తుంది. అర్జున్ ఒక థియేటర్ ఆర్టిస్ట్, అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరియు ప్రతి 56 నిమిషాలకు ఒక మాత్ర వేసుకోవాల్సి వస్తుంది. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత ప్రియ అర్జున్‌ను అనుమానితుడిగా గుర్తిస్తుంది. ఆ తరహా విశ్వాసులు స్వాగతించే చాలా ఆనందదాయకమైన హత్య మిస్టరీ ఇది.
చిత్రం - డీజే దువ్వాడ జగన్నాథం,
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
ఈ చిత్రం 1989 లో జితేంద్ర (జగపతి బాబు), అతని తండ్రి, కర్నూలులో నిర్దాక్షిణ్యమైన డాన్ స్థానిక MLA కుమార్తె అయిన కల్యాణిని పెళ్ళిచుపులు కోసం వైజాగ్ వస్తాడు.తిరిగి వెళ్ళెడప్పుడు, జితేంద్ర కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కారు నుంచి బయటకు రావాలని అడిగిన ఒక వ్యక్తిని కల్చేస్తాడు.దానితో చుట్టు ఉన్న వ్యక్తులు అతనని ఆ ప్రాంతపు పెద్ద మనిషి (సుమన్) దగ్గరకు తీసుకు వెల్తారు.అతని కుటుంబంలో, అతని తల్లి; భార్య (సుహాసిని) ఒక కళాశాల లెక్చరర్; సోదరి (ఈశ్వరి రావు); బావ (రావు రమేశ్); వారి పిల్లలు; యువకుడైన కుమారుడు జైదేవ్, కుమార్తె;, అతని విశ్వసనీయ భాగస్వామి రఘవియా (చలపతి రావు).ఆ పెద్ద మనిషి గాయపడినవారికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించమని జితేంద్రను అడుగుతాడు. ఇది జితేంద్ర అహాన్ని దెబ్బతీస్తుంది, ప్రజలను పేదలుగా పిలిచి వారిని అవమానిస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అతన్ని కొట్టి అతన్ని అరెస్టు చేస్తాడు, అందుచే జితేంద్ర పగ పడతాడు.

జితేంద్ర తండ్రి (రామరాజు) భూస్వామి భార్య, జైదేవ్ను కిడ్నాప్ చేసి, ఫిర్యాదును తిరిగి తీసుకోవాలని అతన్ని బలవంతం చేస్తాడు.జితేంద్ర విడుదలయ్యారు, వారు బంధించి ఉన్న ప్రదేశానికి వెళతారు.అతను తన తండ్రి చనిపొయి ఉండతం చూస్తాడు, వారిలో చాలామంది హంతకులు చంపబడ్డారు. జమీదేవ్ తల్లిని చంపినందువల్ల రామరాజు హత్య చేసినట్లు వెల్లడించారు. అందువలన వారి శత్రుత్వం శాశ్వతమైనది.తిరిగి జయదేవ్ ఇంటిలో, జైదేవ్ నానమ్మ (సుజాత కుమార్) తన ముత్తాత, తాత, మామయ్య లాగ హత్యకు గురవుతాడని భయపడుతుంది, అందువల్ల అమె వారి కుటుంబ సభ్యులందరిని విదేశాలు పంపుతుంది.జితేంద్ర విశాఖపట్నమ్లో పలుకుబడిగల వ్యక్తిగా మారతాడు.

కృష్ణ (నందమూరి బాలకృష్ణ) దుబాయ్లో ఉంటాదు, ఇక్కడ అతను వ్యబిచారమ్లో విక్రయించబడే కొంతమంది భారతీయ బాలికలను రక్షిస్తాడు, అతని ప్రియరాలు స్నేహ (సోనాల్ చౌహాన్), గురు మాణిక్యం (బ్రహ్మానందం)తో కలిసి వైజాగ్ లో తిరిగి రావాలని ప్రణాళిక చేస్తున్నాడు భారతదేశంలో వారి వివాహం గురించి పెద్దలకు చెప్పటానికి.అప్పుడు అతను స్నేహ తండ్రి జితేంద్ర యొక్క వ్యాపార భాగస్వామి (ఆహుతి ప్రసాద్) తో కలస్తాడు.అతను విమానాశ్రయం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను జితేంద్ర పెద్ద కుమారుడు చోటు (శారవణన్), అతని అనుచరులను అతనిని చంపాలని కోరుకునే మాజీ ఎమ్మెల్యేని రక్షిస్తాడు.కృష్ణ వాటిని తీవ్రంగా కొడతాడు, ఇది జైదీవ్ యొక్క మాజీ సహచరుల అది గుర్తిస్తారు. ఇంతలో, చోటు, మాజీ MLA ఇద్దరూ అదే ఆసుపత్రిలో చెరతారు. చొటు ఆ ఎం.ఎల్.ఎ.ని చంపటానికి వెల్తాడు కాని రహస్యకర పరిస్థితులలో అతను చనిపొతాడు.జయదెవ్ పొలిసులతో కలసి హాస్పటల్ సి.సి. ఫుతేజ్లో కృష్ణని చుసి అతనని చంపాలని చుస్తాడు.ఆలయం వద్ద అతను కృష్ణని కాల్చి తన రెండవ కుమారుడు, అతని సహచరులను స్నేహతో సహా మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఆదేశిస్తాడు, కాని సరైన సమయంలో జైదేవ్ (నందమూరి బాలకృష్ణ), కృష్ణుడి అన్నయ్య) వారిని రక్షిస్తాడు.

జైదేవ్ జితేంద్ర రెండవ కుమారుడు,అతని అనుచరులు, ఎసిపిని హత్య చేస్తాడు, జితేంద్ర నియంత్రణలో లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత MLA (జయప్రకాష్ రెడ్డి) ను బెదిరిస్తాడు. జితేంద్ర కుమారులు అంత్యక్రియల అప్పుడు, జితేదేవ్ యొక్క చిన్న కుమారుడికి జైదేవ్ కథను ఎమ్మెల్యే చెప్పి, అతను ప్రమాదకరమైన గతంతో ఉన్నాడని చెబుతాడు.ఈ కథ 1999 కి మారిపోతుంది, అక్కడ జితేంద్ర తన సోదరుడు అజయ్ (అజయ్) ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నాడు, అతని నేర స్వభావం కారణంగా పార్టీ టికెట్ ఇవ్వని స్థానిక MP ని హత్య చేశాడు.జైదెవ్ వారిని కొట్టి జితేంద్రను అరెస్టు చెయిస్తాడు. జైదెవ్ కుటుంబం అతనికి దూరంగ ఉంతుంది.తన మరదలు రాధిక (రాధిక ఆప్టే) అతన్ని ప్రేమించి పెళ్ళి చెసుకుంటుంది.అజయ్ జైలు నుండి బయటికి వచ్చి కృష్ణని ఎత్తుకెల్తాడు.జైదేవ్ అతన్ని చంపి జితేంద్రని వైజగ్ వదిలి వెల్లిపొమ్మంటాడు.కర్నూలు రైల్వే స్టేషన్లో తన మనుషుల ప్రేరణతో వైజగ్ వచ్చి రాధికను రైల్వయ్ యార్డుకు ఎత్తుకెల్తాడు.అక్కడికి జైదెవ్ వచ్చి జితేంద్ర మనుషులను చంపుతాడు.జితేంద్ర రాధికను కత్తితో పొడుస్తాడు.జైదెవ్ జితేంద్రని తెవ్రంగా గాయపరుస్తాడు.రాధిక జైదెవ్ చెతుల్లో చనిపొతుంది.దానితో జైదెవ్ నానమ్మ తన వారి కుటుంబన్ని కలవకూడదని లెకపొతే తను చనిపొతానని హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం జయదేవ్ నుండి రక్షించటానికి జితేంద్ర యొక్క మూడవ కుమారుడు అమెరికాకు వెళ్లడానికి ఎమ్మెల్యే సలహా ఇస్తాడు.జైదెవ్ తన కుటుంబ సభ్యులతో కలుస్తాడు.జితేంద్ర రాష్త్రానికి ముఖ్యమంత్రి అవ్వటానికి ఎం.ఎల్.ఎ.లకు లంచం ఇవ్వటానికి సిద్దపదతాడు.కాని జైదెవ్ వారిని హెచ్చరించి ప్రజల కోసం పని చెయ్యలని చెబుతాడు.జితేంద్ర వారిని చంపటానికి వస్తాడు కాని జైదెవ్ జితేంద్రని చంపటంతో కథ ముగుస్తుంది.


బాలకృష్ణ నందమూరి, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, కమల్ కామరాజు, రావు రమేష్, సమీర్, పృధ్వీరాజ్, హంస నందిని, చలపతి రావు, సుమన్, సుజాత కుమార్, సుహాసిని తారాగణం, సెయింట్, దేవిస్ & ఇతర సంగీతం స్క్రీన్ ప్లే & దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట & అనిల్ సుంకర, సమర్పణ: సాయి కొర్రపాటి.
జాంగ్ అనే పోలీసు అధికారి తన నుండి విడిపోయిన కుమార్తెను కలుస్తాడు, ఆమె అతన్ని తన ప్రియుడు, పబ్ యజమాని అయిన వుకి పరిచయం చేస్తుంది. త్వరలో, వు వారిని మరియు అతని బార్ కస్టమర్లను బంధించి, ఖైదీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాడు. IMDb రేటింగ్ : 5.9/10
ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో గౌతమ్(గోపీచంద్) ఓ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలనేది అతని లక్ష్యం. దాంతో అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ అతని లక్, లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తన తాత గారైన వర్మ(సుమన్) భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషవర్ లో వజ్రాల బిజినెస్ ఉంటుంది. వర్మ అప్పట్లో తన వారసుల కోసం అని వజ్రాలను ఓ చోట దాచి పెట్టి ఉంటారు. అది తెలిసిన గౌతమ్ ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుంటాడు. అనుకోకుండా ఆ వజ్రాల నిధి పాకిస్థాన్ లో ఉంటుంది, అది కూడా లెజండ్రీ హింగ్లాజ్ దేవి టెంపుల్ కి ముడిపడి ఉంటుంది.
తన తాత గారి వీలునామా, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులతో తన నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్థాన్ బయలుదేరుతాడు. అందుకోసం హిందూ మతానికి, దేవాలయాలకు ప్రాధాన్యత నిచ్చే శ్రీనిధి(తాప్సీ) సాయం తీసుకుంటాడు. కానీ గౌతమ్ అనుకున్న జర్నీ అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కి ఆ ప్రోపర్టీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ అయిన సుల్తాన్(శక్తి కపూర్) చేతిలో ఉంటుంది. వారందరినీ ఎదిరించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అడ్వెంచరస్ డ్రామాని తెరపైనే చూడాలి.
IMDb రేటింగ్: 6.8/10
డాన్ సాధు భాయ్ (కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా (జూనియర్ ఎన్.టీ.ఆర్) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్ (ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షాకి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాధు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వయోలెంట్ విక్టర్ (ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి (కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా (బ్రహ్మానందం). అలా సాగుతున్న సమయంలో బాద్‍షాకి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
మహేష్ బాబు,సమంత,బ్రహ్మానందం మరియు ప్రకాష్ రాజ్ మొదలగువారు నటించిన దూకుడు తెలుగు సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, థమన్ ఎస్ సంగీతం అందించారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట గోపీచంద్‌ ఆచంట అనిల్‌ సుంకర నిర్మించారు.
_పూర్తి కథ కోసం లింక్
అమెజాన్ ప్రైమ్ వీడియో లింక్
IMDb రేటింగ్: 7.4/10
రహస్యం, డైనమిక్స్ మరియు ఇతిహాసాల స్ఫూర్తితో నిండిన యాక్షన్-అడ్వెంచర్. ప్రధాన పాత్రధారి, పురావస్తు శాస్త్రవేత్త జాక్ వైల్డర్, పురాతన కళాఖండాల కోసం అన్వేషణలో సంభవించే ఒక మర్మమైన పేలుడులో తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోతాడు. ఈ విషాదాన్ని అంగీకరించలేక, జాక్ దక్షిణ అమెరికాకు గోల్డెన్ క్యాలెండర్ టాబ్లెట్‌ను కనుగొనడానికి ప్రమాదకరమైన యాత్రకు బయలుదేరాడు - పురాణాలు మరియు సాహసికుల దురాశతో కప్పబడిన ఎల్ డొరాడో నగరాన్ని కనుగొనడానికి ఇది కీలకం.
అతని మార్గం అడవి, ఉచ్చులు, దేశద్రోహులు మరియు పురాతన శిథిలాల గుండా ఉంది. ప్రతి అడుగులోనూ అతను మనుగడ కోసం పోరాడటమే కాకుండా, తాను ఎవరిని విశ్వసించవచ్చో కూడా కనుగొనాలి. పురాణ బంగారం కోసం అన్వేషణలో, అతను చాలా విలువైనదాన్ని కనుగొంటాడు - స్నేహం, గౌరవం మరియు గతం గురించి నిజం. ఇండియానా జోన్స్ సాహసాల స్ఫూర్తితో, ఉద్రిక్త వాతావరణం, వేగవంతమైన సంఘటనలు మరియు పురాతన నాగరికతల దృశ్యపరంగా గొప్ప ప్రపంచంతో నిధి కోసం శోధించడం గురించి ఇది ఒక క్లాసిక్ కథ.
IMDB రేటింగ్: 5/10

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10

పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్‌ టీచర్‌.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్‌ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించి లోకల్‌ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్‌ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.

టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10

Featured
షోలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! భారతదేశంలో అత్యంత పురాణ చిత్రంగా నిలిచిన ఐదు దశాబ్దాల వేడుక! షోలే (1975) మనకు ఐకానిక్ పాత్రలు, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు నేటికీ ఉదహరించబడే సంభాషణలను అందించింది. బాలీవుడ్ కథను రూపొందించిన ఈ చిత్రం, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రామ్‌గఢ్ గ్రామంలో,రిటైర్డ్ పోలీస్ చీఫ్ ఠాకూర్ బల్దేవ్ సింగ్(సంజీవ్ కుమార్)పేరుమోసిన బందిపోటు గబ్బర్ సింగ్(అమ్జాద్ ఖాన్)ను అంతం చేయడానికి పథకం వేసి ఇద్దరు చిన్న నేరస్థులు, జై(అమితాబ్ బచ్చన్) మరియు వీరు(ధర్మేంద్ర) సహాయం తీసుకుంటాడు. అయితే, గబ్బర్ గ్రామంపై దాడి చేసినప్పుడు, జై మరియు వీరు ఇద్దరు ఠాకూర్ తమకు సహాయం చేయడానికి ఎందుకు ఏమీ చేయలేదని ఆశ్చర్యపోతారు. అతని వద్ద ఆయుధాలు లేవని, గబ్బర్ నరికివేశాడని వారు త్వరలోనే తెలుసుకుంటారు.దీనితో ఆగ్రహించిన వారు, సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు, విజయం సాధిస్తారు. అమెజాన్ ప్రైమ్ లింక్

అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్జున్‌ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేస్ కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ కేస్‌ని ఛేదించేందుకు ఏం చేశాడు? వరుసగా జరుగుతున్న ఈ హత్యల వెనుక దాగిన చీకటి కోణాలేమిటి?వాటిని చేయిస్తున్నది ఎవరు? ఆయనకీ మృదుల (శ్రీనిధి)కీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. IMDb రేటింగ్: 6.9/10

Showing all 24 results