ఏక్షన్
అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :
IMDb రేటింగ్: 7.3/10
IMDb రేటింగ్: 4.5/10
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
జితేంద్ర తండ్రి (రామరాజు) భూస్వామి భార్య, జైదేవ్ను కిడ్నాప్ చేసి, ఫిర్యాదును తిరిగి తీసుకోవాలని అతన్ని బలవంతం చేస్తాడు.జితేంద్ర విడుదలయ్యారు, వారు బంధించి ఉన్న ప్రదేశానికి వెళతారు.అతను తన తండ్రి చనిపొయి ఉండతం చూస్తాడు, వారిలో చాలామంది హంతకులు చంపబడ్డారు. జమీదేవ్ తల్లిని చంపినందువల్ల రామరాజు హత్య చేసినట్లు వెల్లడించారు. అందువలన వారి శత్రుత్వం శాశ్వతమైనది.తిరిగి జయదేవ్ ఇంటిలో, జైదేవ్ నానమ్మ (సుజాత కుమార్) తన ముత్తాత, తాత, మామయ్య లాగ హత్యకు గురవుతాడని భయపడుతుంది, అందువల్ల అమె వారి కుటుంబ సభ్యులందరిని విదేశాలు పంపుతుంది.జితేంద్ర విశాఖపట్నమ్లో పలుకుబడిగల వ్యక్తిగా మారతాడు.
కృష్ణ (నందమూరి బాలకృష్ణ) దుబాయ్లో ఉంటాదు, ఇక్కడ అతను వ్యబిచారమ్లో విక్రయించబడే కొంతమంది భారతీయ బాలికలను రక్షిస్తాడు, అతని ప్రియరాలు స్నేహ (సోనాల్ చౌహాన్), గురు మాణిక్యం (బ్రహ్మానందం)తో కలిసి వైజాగ్ లో తిరిగి రావాలని ప్రణాళిక చేస్తున్నాడు భారతదేశంలో వారి వివాహం గురించి పెద్దలకు చెప్పటానికి.అప్పుడు అతను స్నేహ తండ్రి జితేంద్ర యొక్క వ్యాపార భాగస్వామి (ఆహుతి ప్రసాద్) తో కలస్తాడు.అతను విమానాశ్రయం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను జితేంద్ర పెద్ద కుమారుడు చోటు (శారవణన్), అతని అనుచరులను అతనిని చంపాలని కోరుకునే మాజీ ఎమ్మెల్యేని రక్షిస్తాడు.కృష్ణ వాటిని తీవ్రంగా కొడతాడు, ఇది జైదీవ్ యొక్క మాజీ సహచరుల అది గుర్తిస్తారు. ఇంతలో, చోటు, మాజీ MLA ఇద్దరూ అదే ఆసుపత్రిలో చెరతారు. చొటు ఆ ఎం.ఎల్.ఎ.ని చంపటానికి వెల్తాడు కాని రహస్యకర పరిస్థితులలో అతను చనిపొతాడు.జయదెవ్ పొలిసులతో కలసి హాస్పటల్ సి.సి. ఫుతేజ్లో కృష్ణని చుసి అతనని చంపాలని చుస్తాడు.ఆలయం వద్ద అతను కృష్ణని కాల్చి తన రెండవ కుమారుడు, అతని సహచరులను స్నేహతో సహా మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఆదేశిస్తాడు, కాని సరైన సమయంలో జైదేవ్ (నందమూరి బాలకృష్ణ), కృష్ణుడి అన్నయ్య) వారిని రక్షిస్తాడు.
జైదేవ్ జితేంద్ర రెండవ కుమారుడు,అతని అనుచరులు, ఎసిపిని హత్య చేస్తాడు, జితేంద్ర నియంత్రణలో లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత MLA (జయప్రకాష్ రెడ్డి) ను బెదిరిస్తాడు. జితేంద్ర కుమారులు అంత్యక్రియల అప్పుడు, జితేదేవ్ యొక్క చిన్న కుమారుడికి జైదేవ్ కథను ఎమ్మెల్యే చెప్పి, అతను ప్రమాదకరమైన గతంతో ఉన్నాడని చెబుతాడు.ఈ కథ 1999 కి మారిపోతుంది, అక్కడ జితేంద్ర తన సోదరుడు అజయ్ (అజయ్) ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నాడు, అతని నేర స్వభావం కారణంగా పార్టీ టికెట్ ఇవ్వని స్థానిక MP ని హత్య చేశాడు.జైదెవ్ వారిని కొట్టి జితేంద్రను అరెస్టు చెయిస్తాడు. జైదెవ్ కుటుంబం అతనికి దూరంగ ఉంతుంది.తన మరదలు రాధిక (రాధిక ఆప్టే) అతన్ని ప్రేమించి పెళ్ళి చెసుకుంటుంది.అజయ్ జైలు నుండి బయటికి వచ్చి కృష్ణని ఎత్తుకెల్తాడు.జైదేవ్ అతన్ని చంపి జితేంద్రని వైజగ్ వదిలి వెల్లిపొమ్మంటాడు.కర్నూలు రైల్వే స్టేషన్లో తన మనుషుల ప్రేరణతో వైజగ్ వచ్చి రాధికను రైల్వయ్ యార్డుకు ఎత్తుకెల్తాడు.అక్కడికి జైదెవ్ వచ్చి జితేంద్ర మనుషులను చంపుతాడు.జితేంద్ర రాధికను కత్తితో పొడుస్తాడు.జైదెవ్ జితేంద్రని తెవ్రంగా గాయపరుస్తాడు.రాధిక జైదెవ్ చెతుల్లో చనిపొతుంది.దానితో జైదెవ్ నానమ్మ తన వారి కుటుంబన్ని కలవకూడదని లెకపొతే తను చనిపొతానని హెచ్చరిస్తుంది.
ప్రస్తుతం జయదేవ్ నుండి రక్షించటానికి జితేంద్ర యొక్క మూడవ కుమారుడు అమెరికాకు వెళ్లడానికి ఎమ్మెల్యే సలహా ఇస్తాడు.జైదెవ్ తన కుటుంబ సభ్యులతో కలుస్తాడు.జితేంద్ర రాష్త్రానికి ముఖ్యమంత్రి అవ్వటానికి ఎం.ఎల్.ఎ.లకు లంచం ఇవ్వటానికి సిద్దపదతాడు.కాని జైదెవ్ వారిని హెచ్చరించి ప్రజల కోసం పని చెయ్యలని చెబుతాడు.జితేంద్ర వారిని చంపటానికి వస్తాడు కాని జైదెవ్ జితేంద్రని చంపటంతో కథ ముగుస్తుంది.
బాలకృష్ణ నందమూరి, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, కమల్ కామరాజు, రావు రమేష్, సమీర్, పృధ్వీరాజ్, హంస నందిని, చలపతి రావు, సుమన్, సుజాత కుమార్, సుహాసిని తారాగణం, సెయింట్, దేవిస్ & ఇతర సంగీతం స్క్రీన్ ప్లే & దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట & అనిల్ సుంకర, సమర్పణ: సాయి కొర్రపాటి.
తన తాత గారి వీలునామా, ఆయన తయారు చేసిన కొన్ని వస్తువులతో తన నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని పాకిస్థాన్ బయలుదేరుతాడు. అందుకోసం హిందూ మతానికి, దేవాలయాలకు ప్రాధాన్యత నిచ్చే శ్రీనిధి(తాప్సీ) సాయం తీసుకుంటాడు. కానీ గౌతమ్ అనుకున్న జర్నీ అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కి ఆ ప్రోపర్టీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ అయిన సుల్తాన్(శక్తి కపూర్) చేతిలో ఉంటుంది. వారందరినీ ఎదిరించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా? అనే అడ్వెంచరస్ డ్రామాని తెరపైనే చూడాలి.
IMDb రేటింగ్: 6.8/10
_పూర్తి కథ కోసం లింక్
అమెజాన్ ప్రైమ్ వీడియో లింక్
IMDb రేటింగ్: 7.4/10
అతని మార్గం అడవి, ఉచ్చులు, దేశద్రోహులు మరియు పురాతన శిథిలాల గుండా ఉంది. ప్రతి అడుగులోనూ అతను మనుగడ కోసం పోరాడటమే కాకుండా, తాను ఎవరిని విశ్వసించవచ్చో కూడా కనుగొనాలి. పురాణ బంగారం కోసం అన్వేషణలో, అతను చాలా విలువైనదాన్ని కనుగొంటాడు - స్నేహం, గౌరవం మరియు గతం గురించి నిజం. ఇండియానా జోన్స్ సాహసాల స్ఫూర్తితో, ఉద్రిక్త వాతావరణం, వేగవంతమైన సంఘటనలు మరియు పురాతన నాగరికతల దృశ్యపరంగా గొప్ప ప్రపంచంతో నిధి కోసం శోధించడం గురించి ఇది ఒక క్లాసిక్ కథ.
IMDB రేటింగ్: 5/10
స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10
గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10
టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10
అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేస్ కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ కేస్ని ఛేదించేందుకు ఏం చేశాడు? వరుసగా జరుగుతున్న ఈ హత్యల వెనుక దాగిన చీకటి కోణాలేమిటి?వాటిని చేయిస్తున్నది ఎవరు? ఆయనకీ మృదుల (శ్రీనిధి)కీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. IMDb రేటింగ్: 6.9/10



























