Featured
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే కథ ఇది. అక్కడి ఎత్తయిన పర్వతాల మధ్య ఓ కొండ నీడ మరో కొండపై పడే చోట నాలుగు రకాల గంజాయిలు పెరుగుతాయి. వాటిలో అత్యంత నాణ్యమైనది, ఖరీదైనది శీలావతి రకం. ఆ కనుమల్లో పండే ఈ గంజాయి పంటపై పూర్తి ఆధిపత్యం కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్‌), కుందుల నాయుడు (చైతన్య రావు) సోదరులదే. కనుమల్లో పండే గంజాయి పంటను ఘాటీ తెగ కూలీలు పోలీసుల కంట పడకుండా అక్రమంగా నాయుడు సోదరుల అడ్డాకు చేరవేస్తే.. దాన్ని వాళ్లు తమ బాస్‌ మహావీర్‌ (జిషు సేన్‌ గుప్తా)కు పంపుతారు. అతని కార్టెల్‌ దాన్ని దేశ విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవడం పరిపాటి. అయితే ప్రాణాలకు తెగించి గంజాయిని అక్రమ రవాణా చేసే ఘాటీలకు కష్టానికి తగ్గ ఫలితం, గౌరవం దక్కకపోవడంతో ఆ తెగకు చెందిన దేశీరాజు (విక్రమ్‌ ప్రభు) ఓ ఆలోచన చేస్తాడు. తన మరదలు షీలావతి (అనుష్క)తో పాటు తోటి ఘాటీలతో కలిసి ఓ కొత్త దందాకు తెర లేపుతాడు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి దేశ విదేశాలకు ఎగుమతి చేయడం మొదలు పెడతారు. అయితే ఈ విషయం నాయుడు సోదరులకు తెలియడంతో ఘాటీలను అంతమొందించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తర్వాత ఏమైంది? తమ తెగలోని జీవితాల్ని బాగు చేసుకోవాలనే సంకల్పంతో దేశీరాజు - షీలావతి కలిసి మొదలు పెట్టిన ఆ వ్యాపారం వాళ్లని ఎన్ని చిక్కుల్లో పడేసింది. ఈ క్రమంలో షీలావతికి జరిగిన అన్యాయమేంటి? నాయుడు సోదరులతో ఆమె ఎలాంటి యుద్ధం చేసింది? అన్నది మిగిలిన కథ.
Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
డతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. తాను ఆచారాన్ని తప్పలేదని వేడుకున్నా... ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని ఊరి ప్రజలు తీర్మానం చేస్తారు. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. ఆచారం ప్రకారం ప్రాణాలైనా వదలాలి, లేదంటే తప్పు చేయలేదనైనా నిరూపించుకోవాలని కోరతారు ఊరి ప్రజలు. దాంతో సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సి వస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి?సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?  
కథేంటంటే.. కింగ్‌పిన్‌ లాజిస్టిక్స్‌ అధినేత సైమన్‌ (నాగార్జున) శక్తిమంతమైన డాన్‌. ప్రభుత్వం నుంచి వైజాగ్‌ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్‌ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) కనిపెట్టిన మొబైల్‌ క్రిమేటర్‌ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్‌.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్‌)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్‌ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్‌) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్‌ మాటున సైమన్‌ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్‌ ఖాన్‌)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్‌ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్‌ (రచిత రామ్‌), అర్జున్‌ సైమన్‌ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.

ఓటీటీ స్ట్రీమింగ్‌ / సెప్టెంబర్ 4,2025 : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడు (మంచు విష్ణు). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి నాథనాథుడు (శరత్‌కుమార్‌). తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు లేడని నమ్ముతుంటాడు. విలు విద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతోపాటు, చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. ఆ గూడేల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది. ఆపద వచ్చిన ప్రతిసారీ అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు తిన్నడు. మనసిచ్చిన నెమలి (ప్రీతి ముకుందన్‌) అతని వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం వెనక కథేమిటి? పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలసింది?ఎవరి చూపు పడనీయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు) ఎవరు? అన్నది కీలకం.

Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
IMDb రేటింగ్: 8.3/10
Leharayi Telugu movie
లూకా అలియాస్ జానీ అనేది ఒక ఉత్కంఠభరితమైన మలయాళ నాటకం, ఇది రెండు జీవితాలను గడుపుతున్న వ్యక్తి యొక్క ద్వంద్వత్వాన్ని విప్పుతుంది - నిశ్శబ్ద మరియు ఆలోచనాత్మక కళాకారిణి లూకా మరియు హింసాత్మక గతం ఉన్న జానీ. కొచ్చి దృశ్య నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేయబడిన ఈ చిత్రం, లూకా తన చీకటి గుర్తింపును పూడ్చిపెట్టి, కళ మరియు ప్రేమ ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించే ప్రయాణాన్ని అనుసరిస్తుంది. కానీ విధికి ఇతర ప్రణాళికలు ఉన్నాయి మరియు అతని గతంలోని దయ్యాలు తిరిగి వచ్చినప్పుడు, లూకా తాను తీవ్రంగా మరచిపోవాలనుకున్న తన వైపు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ భావోద్వేగ థ్రిల్లర్ ప్రేమ, మానసిక సంఘర్షణ మరియు రహస్యం యొక్క అంశాలను అందంగా మిళితం చేస్తుంది. పొరలు తొలగిపోతున్నప్పుడు, వీక్షకుడు ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడు: నిజమైన మనిషి ఎవరు - లూకా లేదా జానీ?
IMDb రేటింగ్ : 6.9/10
Featured
కథ: జై (ప్రభాస్) ఇటలీలో మానస (రిచా గంగోపాధ్యాయ) తో ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబ సభ్యులు పల్నాడు ప్రాంతానికి చెందిన క్రూరమైన ఫ్యాక్షనిస్టులు అనే పేరున్న నేపథ్యం కలిగి ఉన్నారని ఆమె అతనికి చెబుతుంది. జైకి శాంతి తత్వం మరియు ప్రేమ జీవనశైలి ఉంది. యుద్ధం ద్వారా కాదు, ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చని అతను భావిస్తాడు. అతను వేరే సాకుతో మానస గ్రామానికి వెళ్లి ఫ్యాక్షనిస్టుల వైఖరిని మారుస్తాడు. మిగిలిన కథ అంతా జై నేపథ్యం మరియు అతను శాంతిని ప్రచారం చేసే వ్యక్తిగా ఎలా మారాడు అనే దాని గురించి.
IMDb రేటింగ్: 7.3/10
చిత్రం - డీజే దువ్వాడ జగన్నాథం,
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
బాబు (నాని) ఒక అదృష్టవంతుడు, అతను కీర్తి (కీర్తి సురేష్) తో ప్రేమలో పడతాడు. అతను ఆమెను ఆకర్షించడం ప్రారంభించాడు మరియు చాలా ప్రయత్నించిన తర్వాత చివరికి ఆమెను ఆకట్టుకోగలిగాడు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, కీర్తి తండ్రి (సచిన్ ఖడేకర్) మరియు ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ వర్మ (నవీన్ చంద్ర) రూపంలో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ పోలీసు ఎవరు? కీర్తి తండ్రి ఏమి చేస్తున్నాడు? మరియు బాబు తన సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకుంటాడు మరియు చివరికి కీర్తిని ఎలా వివాహం చేసుకుంటాడు? అదే మిగిలిన కథ.
ఈ చిత్రం 1989 లో జితేంద్ర (జగపతి బాబు), అతని తండ్రి, కర్నూలులో నిర్దాక్షిణ్యమైన డాన్ స్థానిక MLA కుమార్తె అయిన కల్యాణిని పెళ్ళిచుపులు కోసం వైజాగ్ వస్తాడు.తిరిగి వెళ్ళెడప్పుడు, జితేంద్ర కారుతో ఒక వ్యక్తిని గుద్ది, కారు నుంచి బయటకు రావాలని అడిగిన ఒక వ్యక్తిని కల్చేస్తాడు.దానితో చుట్టు ఉన్న వ్యక్తులు అతనని ఆ ప్రాంతపు పెద్ద మనిషి (సుమన్) దగ్గరకు తీసుకు వెల్తారు.అతని కుటుంబంలో, అతని తల్లి; భార్య (సుహాసిని) ఒక కళాశాల లెక్చరర్; సోదరి (ఈశ్వరి రావు); బావ (రావు రమేశ్); వారి పిల్లలు; యువకుడైన కుమారుడు జైదేవ్, కుమార్తె;, అతని విశ్వసనీయ భాగస్వామి రఘవియా (చలపతి రావు).ఆ పెద్ద మనిషి గాయపడినవారికి క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించమని జితేంద్రను అడుగుతాడు. ఇది జితేంద్ర అహాన్ని దెబ్బతీస్తుంది, ప్రజలను పేదలుగా పిలిచి వారిని అవమానిస్తాడు. ఆ పెద్ద మనిషి కోపంగా అతన్ని కొట్టి అతన్ని అరెస్టు చేస్తాడు, అందుచే జితేంద్ర పగ పడతాడు.

జితేంద్ర తండ్రి (రామరాజు) భూస్వామి భార్య, జైదేవ్ను కిడ్నాప్ చేసి, ఫిర్యాదును తిరిగి తీసుకోవాలని అతన్ని బలవంతం చేస్తాడు.జితేంద్ర విడుదలయ్యారు, వారు బంధించి ఉన్న ప్రదేశానికి వెళతారు.అతను తన తండ్రి చనిపొయి ఉండతం చూస్తాడు, వారిలో చాలామంది హంతకులు చంపబడ్డారు. జమీదేవ్ తల్లిని చంపినందువల్ల రామరాజు హత్య చేసినట్లు వెల్లడించారు. అందువలన వారి శత్రుత్వం శాశ్వతమైనది.తిరిగి జయదేవ్ ఇంటిలో, జైదేవ్ నానమ్మ (సుజాత కుమార్) తన ముత్తాత, తాత, మామయ్య లాగ హత్యకు గురవుతాడని భయపడుతుంది, అందువల్ల అమె వారి కుటుంబ సభ్యులందరిని విదేశాలు పంపుతుంది.జితేంద్ర విశాఖపట్నమ్లో పలుకుబడిగల వ్యక్తిగా మారతాడు.

కృష్ణ (నందమూరి బాలకృష్ణ) దుబాయ్లో ఉంటాదు, ఇక్కడ అతను వ్యబిచారమ్లో విక్రయించబడే కొంతమంది భారతీయ బాలికలను రక్షిస్తాడు, అతని ప్రియరాలు స్నేహ (సోనాల్ చౌహాన్), గురు మాణిక్యం (బ్రహ్మానందం)తో కలిసి వైజాగ్ లో తిరిగి రావాలని ప్రణాళిక చేస్తున్నాడు భారతదేశంలో వారి వివాహం గురించి పెద్దలకు చెప్పటానికి.అప్పుడు అతను స్నేహ తండ్రి జితేంద్ర యొక్క వ్యాపార భాగస్వామి (ఆహుతి ప్రసాద్) తో కలస్తాడు.అతను విమానాశ్రయం నుండి తిరిగి వచ్చినప్పుడు, అతను జితేంద్ర పెద్ద కుమారుడు చోటు (శారవణన్), అతని అనుచరులను అతనిని చంపాలని కోరుకునే మాజీ ఎమ్మెల్యేని రక్షిస్తాడు.కృష్ణ వాటిని తీవ్రంగా కొడతాడు, ఇది జైదీవ్ యొక్క మాజీ సహచరుల అది గుర్తిస్తారు. ఇంతలో, చోటు, మాజీ MLA ఇద్దరూ అదే ఆసుపత్రిలో చెరతారు. చొటు ఆ ఎం.ఎల్.ఎ.ని చంపటానికి వెల్తాడు కాని రహస్యకర పరిస్థితులలో అతను చనిపొతాడు.జయదెవ్ పొలిసులతో కలసి హాస్పటల్ సి.సి. ఫుతేజ్లో కృష్ణని చుసి అతనని చంపాలని చుస్తాడు.ఆలయం వద్ద అతను కృష్ణని కాల్చి తన రెండవ కుమారుడు, అతని సహచరులను స్నేహతో సహా మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఆదేశిస్తాడు, కాని సరైన సమయంలో జైదేవ్ (నందమూరి బాలకృష్ణ), కృష్ణుడి అన్నయ్య) వారిని రక్షిస్తాడు.

జైదేవ్ జితేంద్ర రెండవ కుమారుడు,అతని అనుచరులు, ఎసిపిని హత్య చేస్తాడు, జితేంద్ర నియంత్రణలో లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రస్తుత MLA (జయప్రకాష్ రెడ్డి) ను బెదిరిస్తాడు. జితేంద్ర కుమారులు అంత్యక్రియల అప్పుడు, జితేదేవ్ యొక్క చిన్న కుమారుడికి జైదేవ్ కథను ఎమ్మెల్యే చెప్పి, అతను ప్రమాదకరమైన గతంతో ఉన్నాడని చెబుతాడు.ఈ కథ 1999 కి మారిపోతుంది, అక్కడ జితేంద్ర తన సోదరుడు అజయ్ (అజయ్) ఎమ్మెల్యేని చేయాలని కోరుకున్నాడు, అతని నేర స్వభావం కారణంగా పార్టీ టికెట్ ఇవ్వని స్థానిక MP ని హత్య చేశాడు.జైదెవ్ వారిని కొట్టి జితేంద్రను అరెస్టు చెయిస్తాడు. జైదెవ్ కుటుంబం అతనికి దూరంగ ఉంతుంది.తన మరదలు రాధిక (రాధిక ఆప్టే) అతన్ని ప్రేమించి పెళ్ళి చెసుకుంటుంది.అజయ్ జైలు నుండి బయటికి వచ్చి కృష్ణని ఎత్తుకెల్తాడు.జైదేవ్ అతన్ని చంపి జితేంద్రని వైజగ్ వదిలి వెల్లిపొమ్మంటాడు.కర్నూలు రైల్వే స్టేషన్లో తన మనుషుల ప్రేరణతో వైజగ్ వచ్చి రాధికను రైల్వయ్ యార్డుకు ఎత్తుకెల్తాడు.అక్కడికి జైదెవ్ వచ్చి జితేంద్ర మనుషులను చంపుతాడు.జితేంద్ర రాధికను కత్తితో పొడుస్తాడు.జైదెవ్ జితేంద్రని తెవ్రంగా గాయపరుస్తాడు.రాధిక జైదెవ్ చెతుల్లో చనిపొతుంది.దానితో జైదెవ్ నానమ్మ తన వారి కుటుంబన్ని కలవకూడదని లెకపొతే తను చనిపొతానని హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం జయదేవ్ నుండి రక్షించటానికి జితేంద్ర యొక్క మూడవ కుమారుడు అమెరికాకు వెళ్లడానికి ఎమ్మెల్యే సలహా ఇస్తాడు.జైదెవ్ తన కుటుంబ సభ్యులతో కలుస్తాడు.జితేంద్ర రాష్త్రానికి ముఖ్యమంత్రి అవ్వటానికి ఎం.ఎల్.ఎ.లకు లంచం ఇవ్వటానికి సిద్దపదతాడు.కాని జైదెవ్ వారిని హెచ్చరించి ప్రజల కోసం పని చెయ్యలని చెబుతాడు.జితేంద్ర వారిని చంపటానికి వస్తాడు కాని జైదెవ్ జితేంద్రని చంపటంతో కథ ముగుస్తుంది.


బాలకృష్ణ నందమూరి, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, కమల్ కామరాజు, రావు రమేష్, సమీర్, పృధ్వీరాజ్, హంస నందిని, చలపతి రావు, సుమన్, సుజాత కుమార్, సుహాసిని తారాగణం, సెయింట్, దేవిస్ & ఇతర సంగీతం స్క్రీన్ ప్లే & దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట & అనిల్ సుంకర, సమర్పణ: సాయి కొర్రపాటి.
డాన్ సాధు భాయ్ (కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా (జూనియర్ ఎన్.టీ.ఆర్) యువ నాయకుడిగా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్ (ముఖేష్ ఋషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక జూదశాలని రంజన్ చూసుకుంటూ ఉంటాడు.అంతర్జాతీయ నేర ప్రపంచంలో బాద్‍షా తన తెలివితేటలతో, ఎంతో దూకుడుగా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న సమయంబాద్‍షాకి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాధు భాయ్ బాద్‍షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్ (ఆశిష్ విద్యార్థి), వయోలెంట్ విక్టర్ (ప్రదేప్ రావత్) తో కలిసి బాద్‍షా ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. సాధు భాయ్ భారతదేశంలో పలు మెట్రో నగరాలలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయడానికి పధకరచన చేస్తాడు. సాధు పధకాలని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్‍షా జానకి (కాజల్ అగర్వాల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా (నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ నియంత్రించే కుటుంబ పెద్ద కూడా, అదే కుటుంబంలో ఒక సభ్యుడు పద్మనాభ సింహా (బ్రహ్మానందం). అలా సాగుతున్న సమయంలో బాద్‍షాకి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్‍షా ఎవరు? బాద్‍షా వేసే పధకాలకి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

గంగారాం ఓ అనాధ. చిన్నతనంలోనే పోలీసు అవ్వాలనే కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఓ హోటల్ క్లీనర్‌గా చేరుతాడు. యజమాని ఎం.ఎస్ నారాయణ వద్దన్నా వినకుండా పనిలో చేరి తన పనిని ప్రారంభిస్తాడు. అలా అక్కడే ఉంటూ నైట్ స్కూల్లో చదువుతూ అనుకున్నట్లుగా ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుతాడు. డ్యూటీలో చేరిన రోజే నలుగురు వాంటెడ్ రౌడీలను పట్టుకుంటాడు. ఇతని దూకుడును చూసి డీఎస్పీ నాజర్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా బాధ్యతలు అప్పగిస్తాడు. తనకు తోడుగా ఉన్న నలుగురితో సిటీలో ఉన్న తల్వార్( షవర్ అలీ) గ్రూప్ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ వారి అనుచరులను మట్టుబెడతాడు. ఇక మలేషియాలో ఉండి హైదరాబాదులో చక్రం తిప్పే మాఫియా ఖలీద్(కెల్లీ దోర్జీ)కు అడ్డుకట్ట వేసే క్రమంలో డీఎస్పీ నుంచి ఊహించని సంఘటన ఎదుర్కొంటాడు గంగారామ్. ఆ దెబ్బతో తను అవినీతి అధికారిగా చిత్రించబడతాడు. ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత మోసం తెలిసి మోసాన్ని మోసంతోనే గెలవాలని గంగూభాయ్‌గా అవతారమెత్తి పోలీసు అధికారులతోపాటు డీజీపిని చంపేసి, ఖలీద్‌ను కూడా వెతుక్కుంటూ మలేషియా వెళ్లి చంపేస్తాడు.
IMDb రేటింగ్ : 6.3/10

సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.
ప్రముఖ రచయిత అకిరా కురోసావా రచించి దర్శకత్వం వహించిన డ్రీమ్స్ (1990), ఒక పౌరాణిక వాస్తవిక సంకలన చిత్రం, ఇది దర్శకుడి స్వంత పునరావృత దర్శనాలు మరియు జపనీస్ జానపద కథల అంశాల నుండి ప్రేరణ పొందిన ఎనిమిది మంత్రముగ్ధులను చేసే విగ్నేట్‌లను కలిపి అల్లుతుంది. ప్రతి భాగం అకిరా టెరావ్, మార్టిన్ స్కోర్సెస్, చిషు ర్యు, మీకో హరాడా మరియు మిత్సుకో బైషో వంటి ప్రతిభావంతులైన తారాగణం ద్వారా ప్రాణం పోసుకున్న ఒక అధివాస్తవిక ప్రపంచంలోకి దూసుకుపోతుంది. కురోసావా కలలలాంటి రాజ్యాలు విప్పుతున్నప్పుడు, అవి వెంటాడే అందాన్ని మరియు మానవ స్వభావం, సంప్రదాయం మరియు మనిషి మరియు ప్రకృతి మధ్య సున్నితమైన సమతుల్యతపై లోతైన ప్రతిబింబాలను సంగ్రహిస్తాయి.

IMDb రేటింగ్: 7.7/10
అమెజాన్ ప్రైమ్ లో చూడాలనుకుంటే లింక్
ఈ చిత్రంలో, ఒక అవినీతిపరుడైన మేయర్ తన "విశ్వసనీయ" సహాయకుడు మరియు అతని ఉంపుడుగత్తె చాలా కాలంగా తనపై కుట్ర చేస్తున్నారని తెలుసుకుని భ్రమపడిపోతాడు. తన సహాయకుడి నేర కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, సహాయకుడు హఠాత్తుగా మేయర్‌ను హత్య చేస్తాడు. ఆ తర్వాత అతను మేయర్‌లా కనిపించే వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా నటించమని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతని అనుకూలమైన తోలుబొమ్మ పాలకుడికి తనకంటూ ఒక ఎజెండా ఉంటుంది మరియు అతని కొత్త యజమానిపై క్రమం తప్పకుండా కుట్రలు పన్నుతూ ఉంటాడు.
IMDb రేటింగ్: 7.3/10
రవితేజ ఒక పారిశ్రామికవేత్త, అతనికి వస్త్ర కంపెనీ ఉంది. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి, కానీ అతని వ్యక్తిగత జీవితంలో సామరస్యం మరియు శాంతి లేదు. అతని భార్య మరియు ఆమె తల్లి హింసించడంతో, అతను జీవితాన్ని దుర్భరంగా భావిస్తాడు. అతను నెమ్మదిగా తన అందమైన పర్సనల్ అసిస్టెంట్ ప్రియంవదను ప్రేమిస్తాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాన్ని తట్టుకోలేరు మరియు అతను మరొక వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడ, అతను చిన్న దొంగ అయిన నాగరాజును కలుస్తాడు. నాగరాజు రవితేజను కాపాడతాడు మరియు అతను వారి స్థానాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తాడు, తద్వారా అతని సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి. నాగరాజు దీనికి అంగీకరిస్తాడు మరియు మాధవికి, ఆమె తల్లికి మరియు రవితేజ శత్రువులకు ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ దొంగ జీవనశైలిని నడిపించే వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను సీతను ఎదుర్కొంటాడు, ఆమె కూడా చిన్న దొంగ. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు మరియు కథను సంతోషంగా ముగించారు.
మౌన రాగం సినిమా దివ్య (రేవతి) అనే కాలేజీ విద్యార్థిని కథను అనుసరిస్తుంది, ఆమె స్వేచ్ఛాయుత వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ ఆమె మాజీ ప్రేమికుడు మనోహర్ (కార్తీక్) మరణంతో ఇప్పటికీ దుఃఖంలో ఉంది. ఆమె కుటుంబం చంద్రకుమార్ (మోహన్) తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుంది. తన కొత్త వివాహంతో రాజీ పడటానికి మరియు తన గతాన్ని వదులుకోలేక పోతున్న దివ్య అంతర్గత సంఘర్షణను ఈ సినిమా అన్వేషిస్తుంది. IMDb రేటింగ్ : 8.4/10

Showing 1–24 of 31 results