డ్రామా
Featured
ఈ చిత్రం స్వతంత్ర జీవితాన్ని గడిపే అంధ వయోలిన్ విద్వాంసుడు రఘు (కమల్ హాసన్) పై కేంద్రీకృతమై ఉంది. అతను నాన్సీ (మాధవి) అనే స్త్రీని కలుస్తాడు, ఆమె అతని కథకు ఆకర్షితురాలై అతని గురించి రాయాలని నిర్ణయించుకుంటుంది. వారి సంబంధం ప్రేమగా మారుతుంది, కానీ వారు కలిసి ఉండటానికి కుటుంబ మరియు సామాజిక అడ్డంకులను అధిగమించాలి.
అమావాస్య చంద్రుడు 1981లో విడుదలైన తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం, దీనిని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దీనిని ఏకకాలంలో తమిళంలో "రాజా పార్వై" పేరుతో చిత్రీకరించి విడుదల చేశారు, ఇది కమల్ హాసన్ నటుడిగా 100వ చిత్రం మరియు నిర్మాతగా అతని మొదటి చిత్రం.
అమావాస్య చంద్రుడు 1981లో విడుదలైన తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం, దీనిని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దీనిని ఏకకాలంలో తమిళంలో "రాజా పార్వై" పేరుతో చిత్రీకరించి విడుదల చేశారు, ఇది కమల్ హాసన్ నటుడిగా 100వ చిత్రం మరియు నిర్మాతగా అతని మొదటి చిత్రం.
Featured
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
IMDb రేటింగ్: 8.8/10
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
Featured
షోలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! భారతదేశంలో అత్యంత పురాణ చిత్రంగా నిలిచిన ఐదు దశాబ్దాల వేడుక! షోలే (1975) మనకు ఐకానిక్ పాత్రలు, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు నేటికీ ఉదహరించబడే సంభాషణలను అందించింది. బాలీవుడ్ కథను రూపొందించిన ఈ చిత్రం, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
రామ్గఢ్ గ్రామంలో,రిటైర్డ్ పోలీస్ చీఫ్ ఠాకూర్ బల్దేవ్ సింగ్(సంజీవ్ కుమార్)పేరుమోసిన బందిపోటు గబ్బర్ సింగ్(అమ్జాద్ ఖాన్)ను అంతం చేయడానికి పథకం వేసి ఇద్దరు చిన్న నేరస్థులు, జై(అమితాబ్ బచ్చన్) మరియు వీరు(ధర్మేంద్ర) సహాయం తీసుకుంటాడు. అయితే, గబ్బర్ గ్రామంపై దాడి చేసినప్పుడు, జై మరియు వీరు ఇద్దరు ఠాకూర్ తమకు సహాయం చేయడానికి ఎందుకు ఏమీ చేయలేదని ఆశ్చర్యపోతారు. అతని వద్ద ఆయుధాలు లేవని, గబ్బర్ నరికివేశాడని వారు త్వరలోనే తెలుసుకుంటారు.దీనితో ఆగ్రహించిన వారు, సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు, విజయం సాధిస్తారు.
అమెజాన్ ప్రైమ్ లింక్
Featured
భాను చందర్ మరియు అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ తెలుగు చిత్రం "నిరీక్షణ" అనే కాలాతీత రొమాంటిక్ డ్రామాను చూడండి. లెజెండరీ బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ భావోద్వేగ ప్రేమకథ అద్భుతమైన నేపథ్యంలో సెట్ చేయబడింది.దాని మనోహరమైన సంగీతం, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు హత్తుకునే కథాంశానికి ప్రసిద్ధి చెందింది.
రఘునందన్ (బొమన్ ఇరానీ) ఇటలీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. లక్ష కోట్ల పైచిలుకు ఆస్తి ఉన్నా తన కూతురు సునంద (నదియా) తనతో ఉండకపోవటం రఘునందన్ మనసుని కలచివేస్తుంటుంది. సునంద రఘు ఇష్టానికి వ్యతిరేకంగా రాజశేఖర్ (రావు రమేశ్) అనే ప్లీడరుని పెళ్ళి చేసుకుంటుంది. అందుకు ప్రతీకారచర్యగా రఘు వారిద్దరినీ ఇంటినుంచి వెళ్ళగొడతాడు. రఘు మనవడు గౌతం నందా (పవన్ కళ్యాణ్) ఇదంతా గమనించి రఘు రాబోయే పుట్టినరోజు సునంద, శేఖర్ మరియూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటావని మాటిస్తాడు.










