రఘునందన్ (బొమన్ ఇరానీ) ఇటలీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. లక్ష కోట్ల పైచిలుకు ఆస్తి ఉన్నా తన కూతురు సునంద (నదియా) తనతో ఉండకపోవటం రఘునందన్ మనసుని కలచివేస్తుంటుంది. సునంద రఘు ఇష్టానికి వ్యతిరేకంగా రాజశేఖర్ (రావు రమేశ్) అనే ప్లీడరుని పెళ్ళి చేసుకుంటుంది. అందుకు ప్రతీకారచర్యగా రఘు వారిద్దరినీ ఇంటినుంచి వెళ్ళగొడతాడు. రఘు మనవడు గౌతం నందా (పవన్ కళ్యాణ్) ఇదంతా గమనించి రఘు రాబోయే పుట్టినరోజు సునంద, శేఖర్ మరియూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటావని మాటిస్తాడు.

Showing the single result