త‌మిళ‌నాడులో తుపాకీ సంస్కృతిని అల‌వాటు చేసి సొమ్ము చేసుకోవాల‌నేది ఒక సిండికేట్ ప‌న్నాగం. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్(షబీర్ కల్లరక్కల్) అనే ఇద్ద‌రు స్నేహితుల్ని రంగంలోకి దించి ట్ర‌క్కుల‌కొద్దీ ఆయుధాల్ని త‌ర‌లిస్తుంది.అవ‌న్నీ ఓ ఫ్యాక్ట‌రీకి చేరుతుండ‌గా ఎన్‌.ఐ.ఏకి తెలుస్తుంది. ప్రేమ్‌నాథ్ (బిజు మేన‌న్‌) నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఏ ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్ట‌రీ మొత్తాన్ని పేల్చివేయాల‌నే ఒక ఆప‌రేష‌న్‌కి న‌డుం బిగిస్తుంది ఎన్‌.ఐ.ఎ. అయితే ఈ ఆప‌రేష‌న్ అంత సుల‌భమైన‌దేమీ కాదు. ఒక‌రి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న ర‌ఘురామ్ (శివ‌కార్తికేయ‌న్‌)ను ప్రేమ్‌నాథ్ క‌లుస్తాడు. ప్రాణాల్ని ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ఘురామ్‌ని ఈ ఆప‌రేష‌న్‌లోకి తీసుకు రావాల‌ని  నిర్ణ‌యిస్తాడు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిందా? అస‌లు ర‌ఘురామ్ ఎవ‌రు?అత‌నికి ప్రాణాలంటే లెక్క‌లేని త‌నం ఎందుకు? మాల‌తి (రుక్మిణీ వ‌సంత్‌)తో అత‌నికి ఉన్న సంబంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.
Featured
ఈటీవీ విన్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తున్న మొట్ట మొద‌టి థియేట్రిక‌ల్ సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ‘90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌’తో యువతకు చేరువైన మౌళి త‌నూజ్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హ‌స‌న్ దీనికి నిర్మాత కావ‌డం విశేషం. అఖిల్ (మౌళి త‌నూజ్‌) చ‌దువుల్లో అంతంత మాత్ర‌మే. అందుకే ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీట్‌తో ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేరాల‌నుకుంటాడు. కానీ, తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు. కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా అదే క‌థే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే. తమ కూతురిని కూడా డాక్ట‌ర్‌గా చూడాల‌నేది వాళ్ల ల‌క్ష్యం. అందుకే కాత్యాయ‌ని కూడా ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది. అక్క‌డే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. ఆ ప‌రిచ‌యం ప్రేమకు దారితీస్తుంది. అఖిల్ త‌న మ‌న‌సులో మాటని బ‌య‌ట పెడ‌తాడు. అప్పుడు కాత్యాయ‌ని త‌నకు సంబంధించిన ఓ విష‌యాన్ని బ‌య‌ట పెడుతుంది. దాంతో ఈ జంట ప్రేమ‌క‌థ‌లో ఓ పెద్ద మ‌లుపు. ఇంత‌కీ కాత్యాయ‌ని చెప్పిన ఆ విష‌యం ఏమిటి?వీళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌కి ఎదురైన స‌మ‌స్య ఏమిటి? ఆ ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 8.2/10
లిటిల్‌ హార్ట్స్‌ – సినిమా రివ్యూలు – లింకులు
చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె తృటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్(మమ్ముట్టి వాయిస్) ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు..? గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
IMDb రేటింగ్: 8.5/10
సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. మూడు ప‌దుల వ‌య‌సు దాటిపోతున్నా స‌రే... అమ్మాయిల్లో త‌నకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాల్ని తిర‌స్క‌రిస్తుంటాడు. స్కూల్‌లో త‌న‌కు సీనియ‌ర్ అయిన వైష్ణ‌వి (శ్రీదేవి విజ‌య్‌కుమార్‌)లో చూసిన ఆ ఐదు క్వాలిటీస్‌ తనకు కాబోయే భార్య‌లో ఉండాలనేది సిద్ధార్థ్ కోరిక‌. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఎంత చెప్పినా అందులో రాజీప‌డ‌డు. తీరా ఉద్యోగరీత్యా విదేశాల‌కు వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్‌కి ఎదుర‌వుతుంది (Sundarakanda Review). తొలి ప‌రిచ‌యంలోనే ఆమెలో త‌న‌కు న‌చ్చే కొన్ని లక్షణాలను గ‌మ‌నిస్తాడు. దాంతో త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకొని మ‌రీ ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు త‌న కుటుంబంతో క‌లిసి ఐరా ఇంటికి వెళ్లాక అక్క‌డ ఎవరూ ఊహించని విషయం తెలుస్తుంది (Sundarakanda Story). అదేంటీ? చిన్న‌ప్పుడు స్కూల్‌లో తాను ఎంత‌గానో ఆరాధించిన వైష్ణ‌వికి సిద్ధార్థ్ ఎందుకు దూర‌మ‌య్యాడు? మ‌ళ్లీ ఆమె త‌న జీవితంలోకి తిరిగొచ్చాక ఏం జ‌రిగింది? అస‌లు సిద్ధార్థ్‌, ఐరా పెళ్లి జ‌రిగిందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
కార్తీక మిస్సింగ్ కేసు అనేది ఒక ఉత్కంఠభరితమైన డ్రామా, ఇది తప్పిపోయిన అమ్మాయి కోసం డిటెక్టివ్ మరియు అతని బృందం వెతుకుతున్న తీరును అనుసరిస్తుంది. ఈ ప్రక్రియలో, కార్తీక గురించి వారికి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ఎవరు? ఆమె అధికారం మరియు ఆర్థిక దోపిడీకి ఎలా గురైంది? ఇప్పుడే కనుగొనండి.
IMDb రేటింగ్: 6.4/10
Pratinidhi 2
నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్ట్ చే అలియాస్ చేత‌న్ (నారా రోహిత్‌). చిన్న‌ప్పుడు త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఆయ‌న గ‌మ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేసే చేత‌న్‌ని ఎన్‌.ఎన్‌.సి ఛాన‌ల్ ఏరికోరి సీఈఓగా నియ‌మిస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మాల‌ని చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్ర‌భావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
రామ్ అలియాస్ రాబిన్‌హుడ్ (నితిన్‌) ఎవ‌రూ లేని ఓ అనాథ. త‌న‌లాంటి తోటి పిల్ల‌ల‌తో క‌లిసి ఓ అనాథ శ‌ర‌ణాల‌యంలో ఆశ్ర‌యం పొందుతుంటాడు. ఆక‌లి, అవ‌స‌రాల కోసం నేరాల బాట పట్టిన రామ్‌.. తెలివిగా చోరీలు చేస్తూ అనాథ శ‌ర‌ణాల‌యాల‌కి అండ‌గా నిలుస్తుంటాడు. పెరిగి పెద్ద‌య్యాక కూడా అదే బాట‌లోనే అతడి ప్ర‌యాణం కొన‌సాగుతుంది. బంగారం చోరీ కేసులో ఐపీఎస్ అధికారి విక్ట‌ర్ వ‌ర్ఘీస్ (షైన్ టామ్ చాకో) చేతికి చిక్కిన‌ట్లే చిక్కి త్రుటిలో త‌ప్పించుకున్న రామ్, కొన్నాళ్లు నేరాల‌బాట వీడి ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అలా జాన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) న‌డుపుతున్న ఇండియాస్ నంబ‌ర్‌వ‌న్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి, ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన నీరా వాసుదేవ్ (శ్రీలీల‌) ర‌క్ష‌ణ బాధ్య‌త‌ల కోసం రంగంలోకి దిగుతాడు. అస‌లు ఎవ‌రీ నీరా వాసుదేవ్? ఆమె ఇండియాకి ఎందుకొచ్చింది?అంత‌ర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్ర‌గ్ మాఫియా ఆమెని ఎందుకు టార్గెట్ చేసింది?అపాయంలోఉన్న నీరా వాసుదేవ్‌కి రామ్ ర‌క్ష‌ణ క‌ల్పించాడా లేదా?అనేది మిగ‌తా క‌థ‌.
IMDb రేటింగ్: 4.5/10
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ కాలేజీలో లెక్చరర్ జాబ్ చేస్తుంటాడు. అతడి సంతానంలో పెద్ద కొడుకు అర్జున్(మొయిన్ మొహమద్) లవ్ ఫెయిల్యూర్ కారణంగా మందుకు బానిసగా మారుతాడు. ఇక రెండో కొడుకు సాయి(మోహిత్) ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అతడి కూతురు అనుపమ(యశస్విని) పద్దతిగా ఉంటూ మెదులుతుంది. అయితే, ఓ సందర్భంలో అనుపమకు సంబంధించి ఓ నిజం చుట్టుపక్కల వారికి తెలియడంతో అందరూ కృష్ణ కుమార్ అండ్ ఫ్యామిలీ గురించి చర్చించుకుంటారు. ఇంతకీ అనుపమ గురించి తెలిసిన నిజం ఏమిటి..? ఆమె ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది..? కృష్ణ కుమార్ కొడుకుల భవిష్యత్తు ఏమవుతుంది..? అనేది సినిమా కథ.
IMDb రేటింగ్: 8.3/10
నిలే, అపరాధ భావనతో బాధపడుతున్న మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, రేడియో జాకీగా మారాడు. ఒక లైవ్ షోలో, తనను కిడ్నాప్ చేశారని ఒక అమ్మాయి నుండి అతనికి కాల్ వస్తుంది. మొదట్లో ఇది ఒక చిలిపి పని అని భావించిన అతను, త్వరలోనే అది నిజమని గ్రహించి, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రత్యక్ష ప్రసారం చేస్తాడు. ఉద్రిక్త పరిస్థితి బయటపడుతుండగా, నిలే గతం నుండి చీకటి రహస్యాలు తిరిగి బయటపడతాయి, కాల్ చేసిన వ్యక్తితో లోతైన సంబంధాన్ని వెల్లడిస్తాయి. పూర్తిగా నిలే దృక్కోణం నుండి చెప్పబడిన ఈ చిత్రం వాయిస్ ఇంటరాక్షన్‌ల ద్వారా ఉత్కంఠను పెంచుతుంది మరియు పట్టుదలగల, ప్రతీకారంతో నడిచే మలుపుతో ముగుస్తుంది.
IMDb రేటింగ్ : 6.2/10
Leharayi Telugu movie
దియా, ఒక యువ అంతర్ముఖ అమ్మాయి కథను చెబుతుంది.ఆమె తన కాలేజీ సహచరులలో ఒకరైన రోహిత్‌ను ప్రేమిస్తున్నప్పుడు ఆమె రోజువారీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. అంతర్ముఖ అమ్మాయిగా ఉండటం మరియు తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించడం ఆమె జీవితంలో అతిపెద్ద సవాలుగా మారుతుంది.
సత్య (అథర్వ) ​​అనే పోలీసు అధికారి, కాల్ సెంటర్‌లో పనిచేసే నిషా (హన్సిక)తో ప్రేమలో పడతాడు. అతను పోలీసు శాఖలో చేరిన వెంటనే, అతనికి ఒక అమ్మాయి తప్పిపోయిందని అనుమానాస్పద కాల్ వస్తుంది మరియు అతను కేసును ఛేదిస్తాడు. సమాంతరంగా, యువతులను అపహరించి అమ్మే బృందం ఉంటుంది. సత్యకు వచ్చిన 100వ కాల్ కిడ్నాప్ చేయబడిన ఇతర అమ్మాయిలతో ఎలా సంబంధం కలిగి ఉందనేది 100 మంది కథను రూపొందిస్తుంది.
చిత్రం - డీజే దువ్వాడ జగన్నాథం,
నటీనటులు - అల్లు అర్జున్,పూజా హెగ్డే,
స్క్రీన్ ప్లే-రమేష్ రెడ్డి, దీపక్ రాజ్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్:ఛోటా కె ప్రసాద్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కళ:రవీందర్,
కథ-మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్,
నిర్మాతలు:దిల్ రాజు & శిరీష్
IMDb రేటింగ్ : 6/10
విడుదల తేదీ: 02 జూన్,2016
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‍గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
IMDb రేటింగ్ : 6.8/10
తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గదుల నుండి ఒక చిన్న బంగారు గణేష్ విగ్రహం దొంగిలించబడింది. విగ్రహం యొక్క పురాతన విలువ కారణంగా విగ్రహం మార్కెట్ ధర భారీగా ఉంటుంది. సూర్య (నిఖిల్) హైదరాబాద్‌లో ఒక అధునాతన జేబు దొంగ మరియు అతను అతని ముఠాలోని ఒక అమ్మాయి మరియు ఒక వ్యక్తి. స్వాతి (స్వాతి) ఒక జర్నలిస్ట్, ఆమె తనకు ఇష్టమైన పసుపు వెస్పా స్కూటర్‌ను కొనుగోలు చేస్తుంది. దుర్గ (రవి బాబు) ఒక దుర్మార్గుడు మరియు అతను విగ్రహాన్ని ఎలా అయినా కాజేయాలనుకుంటాడు.దొంగిలించబడిన గణేష్ విగ్రహం ఈ ముగ్గురు వ్యక్తుల మరియు ఇతరుల జీవితాలను ఎలా పెనవేసుకుంటుంది అనేది మిగిలిన కథ.
IMDb రేటింగ్ : 7.3/10

స్లమ్ బస్తీలో ఉండే కేబుల్ కుర్రాడు ఆనంద్ రాజు(అల్లు అర్జున్). జూబ్లీహిల్స్ లో ఉండే ఓ డబ్బున్న అమ్మాయి(దీక్షా సేధ్)తో కోటీశ్వరుడి కొడుకుని అని అబద్దం చెప్పి ప్రేమలో పడతాడు. ఆమె పార్టీకి రమ్మందని టిక్కెట్లు కోసం డబ్బు దొంగతనానికి కూడా రెడీ అవుతాడు. మరో ప్రక్క వివేక్ చక్రవర్తి(మనోజ్)ఓ రాక్ స్టార్. అతను పాడే పాటల అర్దాలకీ అతని చేష్టలకీ సంభంధం ఉండటం లేదని గర్ల్ ప్రెండ్ (లేఖా వాషిగ్ టన్) విసుక్కుంటూంటుంది. అతని తల్లి ఆర్మీలో చేరమంటే రిజెక్టు చేసి రాక్ బ్యాండ్ పోగ్రాం కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇదిలా ఉంటే తెలంగాణ పల్లెలో అప్పులు పాలైన ఓ బక్క చిక్కిన రైతు కూలీ తన మనవడు చదువుకోసం కిడ్నీని అమ్ముకోవటానికి హైదరాబాద్ బయిలుదేరతాడు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే రహీం అనే ముస్లిం(మనోజ్ బాపపేయి)తనకు హిందువుల వల్ల అవమానం, నష్టం జరిగాయి ఈ దేశంలో ఉండటం అనవసరం అనుకుని షార్జా బయిలుదేరటానకి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఫైనల్ గా ఈ చిత్రంలో చెప్పబడుతున్న సరోజ(అనూష్క) అనే వేశ్య హైదరాబాద్ లో వ్యబిచారం బాగా జరుగుతుందని అమలాపురం నుంచి తప్పించుకుని పారిపోయి వస్తుంది. ఆమెను అమలాపురం వ్యబిచార కేంద్ర బ్యాచ్ వెంబడిస్తూంటుంది. ఇలా రకరకాల ఆలోచనలతో హైదరాబాద్ చేరుకున్న వీరందరూ ఏ విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారు. జీవితంలో ఏమార్పు వచ్చిందనేది తెరపై చూడాల్సిన కథ.
IMDb రేటింగ్: 8/10

 

పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌'పోకిరి'సినిమా.పండు(మహేష్‌బాబు)కిరాయి గుండా.'నేనెంత వెధవనో నాకే తెలియదు' అని అంటూ ఒప్పుకున్న పనులను ఎంద మంది ఎదురొచ్చినా సునాయసంగా పూర్తి చేస్తూ వుంటాడు హీరో.శృతి(ఇలియానా) ఎరోబిక్‌ టీచర్‌.తండ్రిలేని కుటుంబానికి అన్నీ తానే అయి నెట్టుకొస్తూ వుంటుంది.పశుపతి(ఆశీష్‌ విద్యార్థి) అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆమెపై కన్నేసి వెంటపడుతూ వుంటే పండు అండతో తప్పించుకుంటుంది. తర్వాత ప్రేమలో పడి పాటలు పాడుతూ వుంటుంది. మరో పక్క పండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించి లోకల్‌ మాఫియా దగ్గర పనిచేస్తూ పక్క గ్రూప్‌తో తగువు పడతాడు. వాళ్లు అతనిపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈలోగా సిటీకి కొత్తగా వచ్చిన పోలీసు అధికారి (సాయాజి షిండే) ఈ గ్రూప్‌లను అణచేయాలని అనుకుంటూ వుంటాడు. పండు ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు,ఎలా రియాక్ట్‌ అయ్యాడు అన్నది తెరపై చూడాల్సిందే.ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.
సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10
శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
సింధూర తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా సత్యం బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు. అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సూర్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో, ఒక అవినీతిపరుడైన మేయర్ తన "విశ్వసనీయ" సహాయకుడు మరియు అతని ఉంపుడుగత్తె చాలా కాలంగా తనపై కుట్ర చేస్తున్నారని తెలుసుకుని భ్రమపడిపోతాడు. తన సహాయకుడి నేర కార్యకలాపాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, సహాయకుడు హఠాత్తుగా మేయర్‌ను హత్య చేస్తాడు. ఆ తర్వాత అతను మేయర్‌లా కనిపించే వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా నటించమని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతని అనుకూలమైన తోలుబొమ్మ పాలకుడికి తనకంటూ ఒక ఎజెండా ఉంటుంది మరియు అతని కొత్త యజమానిపై క్రమం తప్పకుండా కుట్రలు పన్నుతూ ఉంటాడు.
IMDb రేటింగ్: 7.3/10

Showing 1–24 of 28 results